మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి 


https://chilakaluripetspeednews.blogspot.com/


ఎప్పటి నుండో విద్యార్థులు ఎదురు చూస్తున్నా జగనన్న విద్య దీవెన పధకం కింద ఫీజు రేయింబర్స్మెంట్ డబ్బులను రేపు అనగా 19-04-2021 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కి తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం పలు సార్లు విద్యార్ధులకి ఫీజు కట్టమని నోటీసులు పంపించారు.














Share:

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం 


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలోని పోలిరెడ్డిపాలెం మదర్ థెరిస్సా కాలనీ లోని ఒక మురికి కాల్వలో పసిపాప మృతుదేహం కలచివేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, మున్సిపల్ సిబ్బంది మృతుదేహాన్ని బయటకు తీశారు. నెలల పాప ని ఇలా కాలవలో పడేయటం స్థానికులని కలచివేసింది. ఈ దుర్మార్గపు చర్యకు కారణం కనుకునే పనిలో పడ్డారు స్థానికులు. 
















Share:

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో  గడిచిన విద్య సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని సత్కరించారు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్షునిగా తేళ్ల సుబ్బారావు గారు, ఉపాధ్యక్షునిగా ఘంటా జగన్నాధం గారు, సెక్రెటరీ గా మైలవరపు శివానంద కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి గా బేతంచర్ల రామకోటీశ్వరావు గారు, కోశాధికారిగా బచ్చు రామలింగేశ్వరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  ఈ సందర్భంగా పుల్లరావు గారు మాట్లాడుతూ 5 సార్లు ఎన్నిక అయిన 14 సంవత్సరాల నుండి విద్య సంఘం అధ్యక్షునిగా ఎన్నిక అయిన తేళ్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సేవలు గుర్తు చేసుకొని ఇలాగే మరింత అభివృద్ధి పధంలో ముందుకి సాగాలి అని తెలిపారు.  
















Share:

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద  కూరగాయలతో వెళ్తున్న అప్పి ఆటో బోల్తా పడింది. వివరాలలోకి వెళ్తే గోవింద పురం కి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొలం లో పండిన కూరగాయలను తీసుకొని మార్టూరు మార్కెట్ కి వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఒంగోలు వైపు వెళ్తున్న లారీ అప్పి ఆటోని ఢీ కొన్నది. ఆటో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది అక్కడకి వచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. 



















Share:

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టంలోని మునిసిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో చైర్మెన్ రఫాని గారు, వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, కమిష్నర్ రవీంద్ర గారు,ది  ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు కూనల సుబ్రమణ్యం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న క్రమంలో పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్చందంగా  సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం  6 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాము అని తెలిపారు. పట్టణ ప్రజలు ఇది గమనించి సహకరించవలసినదిగా కోరారు. అలాగే ప్రతి దుకాణంలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి తెలిపారు . కరోనా నియమాలి తప్పకుండా పాటించాలి అని తెలిపారు. 

















 
Share:

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి  ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం. 


















 
Share:

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

https://chilakaluripetspeednews.blogspot.com/

తమిళ సినీ పరిశ్రమకి చెందిన స్టార్ కమెడియన్ వివేక్ (59) ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రతికి లోనైనది. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. అపరిచితుడు, శివాజీ ది బాస్ లాంటి సినిమాలో చాల తెలుగు డబ్బింగ్ మూవీస్ నందు నటించారు. 














Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో శుక్రవారంనాడు ముసిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు సెంటర్లలో మాస్క్ లేకుండా తెరిగే వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూల్ చేసారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మాస్క్ లేకుండా బయట తిరిగితే ఫైన్ వసూళ్లు చేస్తారు అని తెలిపారు. ఈ రోజు పట్టణంలో 28 మంది వద్ద అపరాధరుసుము వసూళ్లు చేసారు. 28 మంది నుండి 4700 రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలిపారు కమీష్నర్ రవీంద్ర గారు. ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించాలి అని కరోనా కట్టడికి సహకరించాలి అని తెలిపారు   


















Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు

 చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు 


https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో ఎన్ ఆర్ టి సెంటర్ నందు శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి రోడ్ పక్కనే వున్నా దుకాణం లోకివెళ్ళింది. వివరాలలోకి వెళ్తే పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నరసరావుపేట వైపు నుండి వస్తూ ఎన్ ఆర్ టి సెంటర్ నందు రోడ్డు దాటుతున్న క్రమంలో ఒంగోలు వైపుగా వెళ్తున్న ఒక లారీ ఢీ కొనటంతో కారు అదుపుతప్పి సెంటర్ లోని రోడ్డు పక్కనే ఉన్న స్వాతి బిర్యాని పాయింట్ లోకి దూసుకువెళ్లింది. ఉదయం కావటంతో ఆ సమయంలో షాప్ తెరిచిలేదు కనుక ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తపింది. కారు ఒక వైపు దెబ్బతిన్నది. 

నిన్న ఆ ప్రదేశానికి 10 అడుగుల దూరంలో మధ్యాహ్నం సమయంలో బైక్కు మంటలు చెలరేగాయి . ఈ రోజు కారు ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు.    











Share:

చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం

 చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం 


https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు 200 పడకలతో కరోనా కేర్ సెంటర్ను మళ్ళి ప్రారంభించబోతున్నారు. పట్టణంలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్లు తక్కువ ఉనందువలన ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు పేటలోని టిడ్కొ ఇళ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 200 పడకలను తరలించి ఆప్రాంతాన్ని శానిటేషన్ చేపిస్తున్నారు అధికారులు. 

























Share:

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణములోని రాగన్నపాలెంలో కరోనా కారణంగా పాస్టర్ మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కరాలకి హాజరైన పలువురు కరోనా అనుమానితులుగా ఉన్న సందర్భంలో స్థానికుల కోరిక మేరకు నిన్న గురువారం నాడు కరోనా  టెస్టులు నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ అధికారి   గోపి నాయక్ గారు మాట్లాడుతూ రాగన్నపాలెం చుట్టుపక్కల ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వచ్చి టెస్టులులలో పాల్గొని పాజిటివ్ వస్తే తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు   

























Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.