చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
చిలకలూరిపేటలో నాయి బ్రాహ్మణ నాయకులూ నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భముగా నాయి బ్రాహ్మణ నాయకులు రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని సత్కరించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
ఈ నెల 23వ తేదీన ఉదయం 9:30 గంటలకు మొదలు మధ్యాన్నం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఇతర వివరాలకు 1800-425-2422 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందాలి అని తెలిపారు. వయసు 18 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి అని అన్నారు.
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--
చిలకలూరిపేట రురల్ ఎస్ ఐ భాస్కర్ గారి ఆధ్వరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ దాడులలో భాగంగా కావూరు గ్రామము నందు 11 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,900 రూపాయల నగదుని సీజ్ చేయటం జరిగింది. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని SI భాస్కర్ గారు తెలిపారు.
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి 224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64, పాండ్య 39*, సూర్య 32 తో చెలరేగిపోయారు . లక్షచేధనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు లో బట్లర్ 52, మలన్ 68 తో రెచ్చిపోయారు . కానీ భువి , శార్దూల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు . చివరకు 20 ఓవర్లకు 188 రన్స్ 8 వికెట్స్ కొలిపోయి భారత్ విజయానికి చేరువ అయినది
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట లోనే వైస్సార్సీపీ కార్యాలయము నందు ఎర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేస్తున్న రజని గారికి పట్టణం లోనే మైనారిటీ లు అందరూ తోడు ఉంటాము . గడిచిన 7 దఫాలుగా పట్టణంలోని మైనారిటీలని కేవలం ఓట్ బ్యాంకు లాగా మాత్రమే చూసారు . కానీ MLA రజని గారు జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం లో పట్టణానికి ఒక మైనారిటీ వ్యక్తిని ఛైర్పర్సన్గ చెయ్యటం ఇదే మొదటిసారి . ఈ సందర్భంగా పట్టణంలోనే ప్రతి ముస్లిమ్ ఓటర్ వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఋణపడి ఉండాలి అని చెప్పారు . ఈ సమావేశం లో పట్టణ వైస్సార్సీపీ నాయకులు . పెద్దలు పాలుగోన్నారు
చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి
చిలకలూరిపేట పట్టణం లో 108 అంబులెన్సు లోనే ఆడ పిల్లకి జన్మనిచ్చిన తల్లి
అంబులున్స్ లోనే డెలివరీ
పట్టణంలోని డైక్మెన్ కాలనీ కి చెందిన వెంకటేశ్వరమ్మ అన్నే మహిళా శుక్రవారం అర్ధరాత్రి నాడు 108 వాహనం లోనే ఆడపిల్లకి జన్మనిచ్చారు . వివరాలలోకి వెళ్తే వెంకటేశ్వరమ్మ మహిళకి అర్ధరాత్రి నాడు పురిటినొప్పులు ఏక్కువ అయ్యాయి . ఆయా సమయం లో 108 వాహనానికి కాల్ చెయ్యగా హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించే సమయంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి . 108 సిబ్బంద్ది శోభన్ బాబు , ఖమీర్ మియ వాహనాన్ని రోడ్ పక్కకి ఆపి పురుడు పోశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం గా ఉన్నారు . వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!
చిలకలూరిపేట పట్టణ పురపాలకసంఘ ప్రతిపక్ష నేతగా గంగా శ్రీనివాసరావు !!!
చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
చిలకలూరిపేట స్పెషల్ లవర్స్ ట్రీ మీరు ఎప్పుడు అయినా చూసారా .. !
లవర్స్ ట్రీ
పైన ఫోటో లోని లొకేషన్ చూసి ఇది ఎక్కడో ఊటీనో , కొడైకెనాలోనో లేదా సిమ్లా , కాశ్మీర్ అనుకుంటే పొరపాటు పడినట్లే . ఈ లొకేషన్ మన చిలకలూరిపేటలోనే ఉంది . ఎక్కడ అని ఆలోచించకండి . నేనే చేపుతాను. మన మంచినీటి చెరువుకి వెళ్ళేదారిలో KGF ధాబా కి 100 అడుగుల దూరం ఉంది ఈ లొకేషన్ . పోదు పొద్దునే వాకింగ్ కి వెళ్ళివాళ్ళు ఈ ట్రీకి లవర్స్ ట్రీ అని పేరు కూడా పెట్టేసారు . కేవలం ఈ లవర్స్ ట్రీ ని చూడటానికి కూడా పొద్దునే చాల మంది వస్తున్నారు . ఇంక ఎందుకు ఆలస్యం మీరుకూడా ఒక లుక్ వేసి రండి .
మీకోసం ఇంకొన్ని ఫొటోస్
చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిలకలూరిపేట రురల్ పరిధిలో పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిలకలూరిపేట మండల పరిధిలోని కుక్కపల్లివారి గ్రామములో పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకున్నారు రురల్ ఎస్ఐ భాస్కర్ గారు . ఈ సందర్బంగా ఆయనా మాట్లాడుతూ ఎక్కడైనా పేకాడుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు . కుక్కపల్లివారిపాలెం గ్రామము నందు ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1800 రూపాయల నగదుని సీజ్ చేసారు ..
వాట్సాప్ ఆగిపోయింది
వాట్సాప్ ఆగిపోయింది
వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి . ఈ రాత్రి సుమారు 11 గంటల నుండి వాట్సాప్ మెసెంజర్ యాప్ సేవలు నిలిచిపోయాయి . ఆండ్రాయిడ్ , ఐఫోన్ , విండోస్ , బ్లాక్బెర్రీ మొబైల్స్ లో సేవలు ఆగిపోయాయి . దీనికి కారణం తెలియలిసివుంది . మేజర్ మెసెంజర్ యాప్ ఆగిపోవటం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు యూజర్స్ .
గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది
గుంటూరు మేయర్ పదవి ఇద్దరిని వరించింది
ప్రతిష్టాత్మక గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో వైస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది . అయితే ఈసారి మేయర్ పదవులు ఇద్దరిని వరించాయి . నిన్నా ప్రమాణంస్వీకారం చేసిన కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారితో పాటుగా పాదర్తి రమేష్ గాంధీ గారిని కూడా మేయర్ పదవి వరించింది . మొదటి రెండున్నర సంవత్సరాలు మనోహర్ నాయుడు గారు మిగిలిన రెండున్నర సంవత్త్సరాలు రమేష్ గాంధీ గారు చేపడతారు అని నిన్న కాన్వెంక్షన్ హాలులో జరిగిన సమావేశం అనంతరం గుంటూరు జిల్లా ఇంచార్జి అయిన చెరుకువాడ శ్రీరంగనాధం గారు ప్రకటించారు .
చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం
చిలకలూరిపేట మున్సిపల్ రెండవ వైస్ ఛైర్మెన్ ను ప్రకటించే అవకాశం
గతంలో ఒక డిప్యూటీ మేయర్ మరియు ఒక వైస్ ఛైర్మెన్ మాత్రమే ఉండేవారు . కొత్తగా వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్సు ప్రకారం ఇద్దరు డిప్యూటీ మేయర్లు , ఇద్దరు వైస్ ఛైర్మన్లను ఎన్నుకొనే అవకాశం కలిపిస్తూ గవర్నర్ అప్రూవల్ కోసం చూస్తున్నారు.ఈ ఆర్డినెన్సు అప్రూవల్ అయితే అన్ని కార్పొరేషన్ లలో మరియు మునిసిపాలిటీలలో అధనంగా ఇంకొకరికి అవకాశం ఉంటుంది . ప్రస్తుతానికి నిన్న వైస్ ఛైర్మెన్ గా కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నారు .
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు రహదారి వద్ద ట్రాక్టరు బోల్తా